యాదాద్రి, అక్టోబర్ 25: యాదగిరీశుడి క్షేత్రంలో నిర్మించిన అధునాతన సత్యనారాయణ స్వామి వ్రత మండపం బుధవారం అందుబాటులోకి రానున్నది. కొండకింద ఉత్తర దిశలో నిర్మాణాలను వైటీడీఏ ఆధ్వ ర్యంలో చేపట్టారు. 2.57 ఎకరాల్లో రూ.17.38 కోట్లు వెచ్చించి నిర్మించారు. రోజుకు 12 వేల వ్రతాలు నిర్వహించేందుకు సర్వహంగులతో తీర్చిదిద్దారు. గురువారం నుంచి సత్యనారాయణ స్వామి వ్రతాలను ఈ మండపంలోనే నిర్వహిస్తామని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. కొండకిందకు వచ్చే ఎగ్జిట్ ఫ్లైఓవర్ దిగువ భాగంలో దీన్ని నిర్మించారు. వ్రతాల కోసం రెండు హాళ్లను నిర్మించగా, ఒక్కో హాలులో 250 వ్రత పీటలు ఏర్పాటు చేశారు.
ఒక్కో వ్రత పీటంపై నాలుగు జంటలు వ్రతమాచరించవచ్చు. హాల్కు వెయ్యి చొప్పున రెండు హాళ్లలో కలిపి ఏకకాలంలో రెండు వేల వంది వ్రతాలు జరుపుకోవచ్చు. ఇలా రోజుకు ఆరు బ్యాచ్లుగా విభజించి మొత్తం 12 వేల వ్రతాలను నిర్వహించనున్నారు. సిబ్బంది గది, ఇంచార్జి గది, అర్చక గది, టికెట్ కౌంటర్, పురుషులు, స్త్రీలకు ప్రత్యేక డ్రెసింగ్ రూమ్లు, పూజా సామగ్రి భద్రపరిచే గది, కొబ్బరికాయ కొట్టే ప్రాంతం, వ్రత పీటలు భద్రపరిచే గది, పురుషులకు 9, స్త్రీలకు 11 ప్రత్యేక టాయిలెట్స్ నిర్మించారు. వికలాంగులు, అర్చకులకు ప్రత్యేకంగా టాయిలెట్స్, అర్చకులు పూజలు నిర్వహించేందుకు ప్రత్యేకమైన స్టేజీ నిర్మించారు.
కార్తీకమాసం సందర్భంగా యాదగిరిగుట్టలో బుధవారం సామూహిక కార్తీక దీపోత్సవాన్ని అత్యం త వైభవంగా నిర్వహించనున్నారు. ప్రధానాలయ తూర్పు మాడ వీధుల్లో సాయంత్రం 6 గంటల నుంచి దీపారాధన ఉత్సవాలను ప్రారంభిస్తామని ఆలయ ఈవో ఎన్ గీత, ప్రధానార్చకులు నల్లన్థీఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు. భక్తులంతా దీపోత్సవంలో పాల్గొని జ్యోతిర్కాంతిలో నారసింహుడిని దర్శించుకోవాలని కోరారు.