న్యూఢిల్లీ: భారత స్టార్ టేబుల్ టెన్నిస్ (టీటీ) ప్లేయర్ సాతియాన్.. సింగపూర్ స్మాష్ టోర్నమెంట్లో శుభారంభం చేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో సాతియాన్ 3-1 (11-6, 8-11, 11-9, 11-8)తో యే ఇన్ కోయిన్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించాడు. తొలి గేమ్ నెగ్గాక రెండో గేమ్లో ప్రత్యర్థి నుంచి ప్రపంచ 33వ ర్యాంకర్ సాతియాన్కు పోటీ ఎదురైనా.. ఆ తర్వాత వరుసగా రెండు గేమ్లు నెగ్గిన భారత ప్యాడ్లర్ మ్యాచ్ను ముగించాడు. ఇదే టోర్నీలో బరిలోకి దిగిన శరత్ కమల్ 1-3 (11-6, 7-11, 6-11, 8-11)తో ఆంటోన్ కాల్బెర్గ్ (స్వీడన్) ఓటమి పాలవగా.. మహిళల సింగిల్స్లో మనికా బాత్రా తొలి రౌండ్లోనే ఓడి ఇంటిదారి పట్టింది.