న్యూఢిల్లీ: భారత స్టార్ టేబుల్ టెన్నిస్ (టీటీ) జోడీ సాతియాన్ జ్ఞానశేఖరన్-హర్మీత్ దేశాయ్ డబ్ల్యూటీటీ కంటెండర్ ట్యూనిస్ టోర్నీలో ఫైనల్కు దూసుకెళ్లింది. ట్యునిషియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్ సెమీస్లో శుక్రవారం సాతియాన్-హర్మీత్ జంట 3-2 (8-11, 12-14, 11-9, 11-8, 11-9)తో ఎసెకీ-ఆడమ్ జుదీ (హంగేరీ) ద్వయంపై విజయం సాధించింది. తొలి రెండు గేమ్లు కోల్పోయి వెనుకంజలో పడ్డ భారత జంట.. ఆ తర్వాత వరుసగా మూడు గేమ్లు నెగ్గి ఫైనల్కు అర్హత సాధించడం విశేషం. నేడు జరుగనున్న తుదిపోరులో ఫ్రాన్స్ జోడీతో భారత్ ద్వయం తలపడనుంది. మరోవైపు మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో సాతియాన్-మనికా బాత్రా జంట 2-3 (11-7, 11-9, 6-11, 9-11, 9-11)తో ఇమ్మాన్యుయేల్-జియా నాన్ యుఆన్ (ఫ్రెంచ్) జోడీ చేతిలో ఓటమి పాలైంది.