న్యూఢిల్లీ: భారత స్టార్ టేబుల్ టెన్నిస్ (టీటీ) జోడీ సాతియాన్ జ్ఞానశేఖరన్-హర్మీత్ దేశాయ్ డబ్ల్యూటీటీ కంటెండర్ ట్యూనిస్ టోర్నీ టైటిల్ కైవసం చేసుకుంది. ట్యునిషియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో శనివారం సాతియాన్-హర్మీత్ జంట 3-1 (11-9, 4-11, 11-9, 11-6)తో ఇమ్మాన్యూయేల్ లెబెసన్-అలెగ్జాండర్ కాసిన్ (ఫ్రాన్స్)ని చిత్తు చేసి విజేతగా నిలిచింది. అంతర్జాతీయ ప్రో టూర్లో భారత ద్వయానికి ఇదే తొలి టైటిల్ కావడం విశేషం.