నిజామాబాద్ రూరల్, నవంబర్ 26 : సారంగాపూర్ పంప్హౌస్ పనులను త్వరగా పూర్తిచేసి డిసెంబర్ నెలాఖరులోగా వెట్న్ ప్రారంభించాలని నీటిపారుదల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ఆదేశించారు. నిజామాబాద్ నగర శివారులోని సారంగాపూర్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టు 20వ ప్యాకేజీ కింద నిర్మిస్తున్న సర్జ్పూల్ పంప్హౌస్ను సీఈ మధుసూదన్రావు, కాళేశ్వరం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి శుక్రవారం సందర్శించారు. సెప్టెంబర్ 8న పంప్హౌస్లోకి నీరుచేరి మోటర్లు మునిగిపోయిన విషయం తెలిసిందే. నీటిని తోడేసిన అనంతరం ప్రస్తుతం మోటర్ల బిగింపు పనులు కొనసాగుతుండగా, అధికారులు పరిశీలించారు. అనంతరం అధికారులతో ఈసీ సమావేశమై పనుల పురోగతిపై సమీక్షించారు. మోటర్ల కోసం విద్యుత్శాఖ అధికారులు రూ.6.88 కోట్ల వ్యయమవుతుందని అంచనా వేసి ఇచ్చారు. ఈ మేరకు సీఈ అనుమతి తీసుకొని మూడు రోజుల్లో బిల్లు పేమెంట్ పూర్తిచేస్తే విద్యుత్ సరఫరా ప్రారంభమవుతుందని కాళేశ్వరం ప్రాజెక్టు ఈఈ ఉదయ్కుమార్ వివరించారు. అనంతరం ఈసీ మురళీధర్ మాట్లాడుతూ.. మోటర్ల బిగింపు, విద్యుత్ పనులను డిసెంబర్ నెలాఖరులోగా పూర్తిచేసి వెట్న్ ప్రారంభించాలని, యాసంగిలో సాగునీరు అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంజినీర్ చీఫ్ వెంట ఎస్ఈ బద్రీనారాయణ, ఈఈ ఉదయ్కుమార్, డీఈ బలరాం, ఏఈ భుజేందర్ తదితరులు పాల్గొన్నారు.