భారత స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మిర్జా.. తన జోడీ మేట్ పావిక్తో కలిసి వింబుల్డన్ రెండో రౌండ్లో అడుగు పెట్టింది. ఇదే తన ఆఖరి వింబుల్డర్ టోర్నమెంట్ అని ఇప్పటికే ప్రకటించిన సానియా.. శుక్రవారం జరిగిన మిక్సిడ్ డబుల్స్ మ్యాచ్లో 6-4, 3-6, 7-6 (10-3) తేడాతో విజయం సాధించింది.
ఆరో సీడ్గా బరిలో దిగిన సానియా-మేట్ పావిక్ జోడీ.. అన్సీడెడ్ జోడీ అయిన డేవిడ్ వేగా హెర్నాండెజ్-నటాలీ జాలమిజే జోడీని ఓడించి రెండో రౌండ్లో అడుగు పెట్టింది. ఈ అంతర్జాతీయ సీజన్ తనకు చివరిదని సానియా కొన్నిరోజుల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె చివరి వింబుల్డన్ ప్రదర్శన ఎలా ఉండనుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.