సంగారెడ్డి : పటాన్చెరు పాశమైలారం పారిశ్రామిక వాడలో అక్రమంగా నిర్వహిస్తున్న కల్తీ పాల సెంటర్పై పోలీసులు దాడులు చేశారు. పటాన్ చెరు డీఎస్పీ భీమ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి, కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. హెరిటేజ్, ఎన్ఎస్ఎల్, వల్లభ వంటి బ్రాండ్ల పేర్లతో కల్తీ పాలను తయారు చేస్తున్నట్లు తేలింది. ఇదే బ్రాండ్ల పేరుతో పెరుగు డబ్బాలను కూడా తయారు చేసి, హోటల్స్, ఫంక్షన్ హాల్స్కు, స్థానిక కిరణా దుకాణాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ సెంటర్ను పవిత్ర, మహేంద్ర, వెంకటేశ్వర అనే పేర్లతో నిర్వహిస్తున్నారు. ఈ కల్తీ పాలు, పెరుగు తినడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని డీఎస్పీ భీమ్ రెడ్డి తెలిపారు. నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.