ACB | సంగారెడ్డి: సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి గోవింద రామ్ లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ కాలేజీ ఇన్స్పెక్షన్ చేసిన ఆయన పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడానికి రూ.50,000 డిమాండ్ చేశారు.
బాధితుడు గతవారం రూ. 30,000 ఇచ్చాడు. మిగతా రూ. 20,000 కోసం ఫోన్ చేసి అడగటంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ రెడ్డి బృందం కార్యాలయంలో రూ. 20,000 ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Acb Raids