హైదరాబాద్, మార్చి 29: సామ్సంగ్..సరికొత్తగా గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఒకేసారి ఐదు రకాల మోడళ్ళను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. వీటిలో కొన్ని 5జీ ఫోన్లు కాగా, మరికొన్ని 4జీ ఫోన్లు. రూ.15 వేల ప్రారంభ ధరతో లభించనున్న ఈఫోన్లు ఆన్లైన్తోపాటు రిటైల్ అవుట్లెట్లలోనూ లభించనున్నాయి. 108 మెగాపిక్సెల్ ఫ్యాగ్షిప్ కెమెరా కలిగిన ఏ73 5జీ ఫోన్ ధరను సంస్థ వెల్లడించలేదు. 6జీబీ+128 జీబీ, 8జీబీ+256జీబీ రకాల్లో లభించనున్నాయి.