బోధన్/మోర్తాడ్/నవీపేట, నవంబర్ 24: బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో టీఆర్ఎస్ నాయకులు బుధవారం సంబురాలు జరుపుకొన్నారు. ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవంపై హర్షం వ్యక్తం చేస్తూ సంబురాలను ఘనంగా జరుపుకొన్నారు. ముందుగా నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం పటాకు లు కాల్చి, స్వీట్లు తినిపించుకొన్నారు. కార్యక్రమంలో బోధన్ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వర్రావు దేశాయ్, డీసీసీబీ డైరెక్టర్లు గిర్దావర్ గంగారెడ్డి, శరత్, టీఆర్ఎస్ మైనార్టీ జిల్లా నాయకుడు ఎంఏ. రజాక్, కౌన్సిలర్లు తూము శరత్రెడ్డి, దూప్సింగ్ నాయక్, బోధన్ మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు బుద్దె రాజేశ్వర్, మారుతీ మందిరం చైర్మన్ నాగన్పల్లి మధు, రైతు కమిటీ పట్టణ అధ్యక్షుడు లింగారెడ్డి, నాయకులు లింగన్న, అశ్వాక్ అహ్మద్, అశోక్రెడ్డి, శంకర్ గౌడ్, వెంకట్, భవానీపేట్ శ్రీనివాస్, శివ కుమార్ పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు సంబురాలు జరుపుకొన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో స్వీట్లు పంచి, పటాకులు కాల్చారు. ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీటీసీ రవి, మండల అధ్యక్షుడు ఏలియా, రైతు బంధుసమితి మండల కన్వీనర్ పర్స దేవన్న, డీసీసీబీ డైరెక్టర్ భూమ న్న, సొసైఈ డైరెక్టర్ నవీన్, సర్పంచ్ రాజేశ్వర్, ఎంపీటీసీ అశోక్, సత్యనారాయణ, ఇంతియాజ్, సుమన్, ముత్తె న్న, యూసుఫ్, శ్రీనివాస్ పాల్గొన్నా రు. నవీపేటలో టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు మువ్వ నాగేశ్వర్ రావు, దొంత ప్రవీణ్కుమార్, టీఆర్ఎస్ సీనియర్ నాయకు డు తెడ్డు పోశెట్టి ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి పటాకులు కాల్చి సంబురాల్లో మునిగి తేలారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నీరడి బుచ్చన్న, ఎంపీటీసీ బేగరి జనార్దన్, కవితక్క, షకీల్ అన్నా యువసేనా మండల అధ్యక్ష, కార్యదర్శులు గైని సతీశ్, ఈర్నాల స్వామి, నాయకులు నర్సయ్య, అల్తాఫొద్దీన్, షకీల్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు తాహేర్, జీయొద్దీన్, నవీన్రాజ్, రాజేందర్రెడ్డి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.