Samantha Ruth Prabhu | ‘ఏమాయ చేశావే’ సినిమాతో టాలీవుడ్ సినీ ప్రేమికులను మాయలో పడేసింది సమంత. ఏమాయ చేశావే నుంచి ఇప్పటివరకు సమంత క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. సోషల్ మీడియాలో తరచూ ఘాటైన ఫోటోలను అప్లోడ్ చేస్తూ ఫాలోవర్ల సంఖ్య పెంచుకుంటుంది. నాగచైతన్యతో విడాకుల తర్వాత ఈమె మరింత జోరుగా సినిమాలను చేస్తుంది. ప్రస్తుతం ఈమె చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతుంది. ఇదిలా ఉంటే ఈమె తాజాగా ఓ బాలీవుడ్ స్టార్తో జతకట్టనున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం సౌత్ హీరోయన్ల కన్ను బాలీవుడ్పై పడింది. ఈ క్రమంలో సమంత కూడా బాలీవుడ్లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాలని తీవ్ర ప్రయత్నాలే చేస్తుంది. ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీస్తో బాలీవుడ్లో ఈమె క్రేజ్ అమాంతం పెరిగింది. ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సమంతకు ఓ కథను వినిపించాడట. దానికి సమంత కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఈ ప్రాజెక్ట్లో సమంత బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్కు జోడీగా నటించనుంది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయన్లకు స్థానం ఉండగా సమంత ఒక హీరోయిన్గా ఎంపికైంది. అంతేకాకుండా ఈ చిత్రానికి సమంత భారీగా దాదాపు 5కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. దానికి నిర్మాతలు కూడా అంగీకరించారని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సమంత ప్రస్తుతం వరుణ్ ధావన్తో కలిసి ఓ హిందీ వెబ్ సిరీస్లో నటిస్తుంది. ఈమె నటించిన ‘కణ్మణి రాంబో ఖతిజా’ ఏప్రిల్ 28న విడుదల కానుంది. నయనతార, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని నయనతార ప్రియుడు విఘ్నేష్ శివన్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. దీంతో పాటుగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ‘శాకుంతలం’ పోస్ట్ ప్రోడక్షన్ పనులలో బిజీగా ఉండగా ‘యశోద’ చిత్రీకరణ దశలో ఉంది.