లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాంపూర్ జిల్లా కేంద్రమైన రాంపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సమాజ్వాది పార్టీ అభ్యర్థి అజాంఖాన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ స్థానం నుంచి ఆయన బీజేపీ అభ్యర్థి శివబహదూర్ సక్సేనాపై 46,842 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇదిలావుంటే ఖుషీనగర్ జిల్లాలోని ఫజిల్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్పీ సీనియర్ నాయకుడు స్వామి ప్రసాద్ మౌర్య వెనుకంజలో ఉన్నారు.
యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య అసెంబ్లీ ఎన్నికలకు ముందు సమాజ్వాది పార్టీలో చేరారు. ఈ ఎన్నికల్లో ఫజిల్నగర్ నుంచి ఆయన బరిలో దిగిన ఆయన వెనుకంజలో కొనసాగుతున్నారు.