హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇండో-శ్రీలంక మాస్టర్స్ స్విమ్మింగ్ టోర్నీలో తెలంగాణ స్విమ్మర్ షేక్ సాజిదా నాలుగు పతకాలతో అదరగొట్టింది. శ్రీలంకలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో మన అమ్మాయి 4 స్వర్ణాలు కైవసం చేసుకుంది. 200 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 100 మీటర్ల బ్యాక్ స్ట్రోక్, 50 మీటర్ల ఫ్రీ ైస్టెల్, 50 మీటర్ల బటర్ఫ్లై స్ట్రోక్ ఈవెంట్లలో విజేతగా నిలిచింది. తనకు సహకరించిన రామకృష్ణ, ఉమేశ్, సిద్ధిఖీ, జగదీశ్ తదితరులకు ఈ సందర్భంగా సాజిదా కృతజ్ఞతలు తెలిపింది.