న్యూఢిల్లీ: తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్లో రిషబ్ పంత్ స్టాండ్ ఇన్ కెప్టెన్గా చేసిన విషయం తెలిసిందే. 2-2 తేడాతో సిరీస్ డ్రా కావడంతో రెండు జట్లు ట్రోఫీని పంచుకున్నాయి. వికెట్ కీపర్ రిషబ్ పంత్కు ఓ సోదరి ఉంది. ఆమె పేరు సాక్షీ పంత్. రిషబ్ కన్నా ఆ ముద్దుగుమ్మ రెండేళ్లు పెద్దది. సాక్షీ పంత్ 1995, సెప్టెంబర్ 24వ తేదీన జన్మించింది. ప్రస్తుతం ఆమె యూకేలో స్టడీ చేస్తోంది. డెహ్రాడూన్లోని డూన్ కాలేజీలోనూ సాక్షీ చదువుకున్నది. సాక్షీ పంత్కు ట్రావెలింగ్ అంటే ఇష్టం. విపరీతంగా టూర్లు చేసే ఆమె తన సోషల్ మీడియాలో ఎప్పుడూ ఫోటోలను అప్డేట్ చేస్తుంటుంది. ఆమెకు బ్రిటన్ చాలా ఇష్టమైన ప్రదేశం. సాక్షీ పంత్కు ఇన్స్టాగ్రామ్లో లక్ష మంది ఫాలోవర్లు ఉన్నారు. రిషబ్తో పాటు ఇతర ఫ్యామిలీ మెంబర్స్తో దిగిన ఫోటోలను సాక్షీ తరుచూ అప్డేట్ చేస్తుంటుంది.