అభాగ్య మహిళలకు అండగా నిలుస్తున్నది సఖీ కేంద్రం. మానసిక వేధింపులు, అదనపు కట్నం కోసం
చిత్రహింసలు, భర్త చనిపోయిన తర్వాత తనను, పిల్లలను అత్తింటి వారు వేధించడం, ప్రేమ పేరుతో మోసపోయిన వారు, లైంగిక వేధింపులు.. ఇలా ప్రతీరోజు ఏదో ఒక ప్రాంతంలో.. ఏదో ఒక కారణంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న మహిళలకు మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నది మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సఖీ కేంద్రం.ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలు వెంటనే స్పందించి సమస్య పరిష్కరించేందుకు నిర్వాహకులు కృషి చేస్తున్నారు.
కష్టాల్లో ఉన్న మహిళలకు ‘సఖీ’ కేంద్రం బాసటగా నిలుస్తున్నది. 181కి ఒక్క ఫోన్ కాల్చేస్తే చాలు అర్ధరాత్రైనా బాధితుల వద్దకు చేరుకుని కావాల్సిన సాయాన్ని అందిస్తున్నది. 2019 సెప్టెంబర్లో మెదక్ జిల్లాకేంద్రంలో ఈ సెంటర్ను ఏర్పాటు చేశారు. వివిధ కారణాలతో ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 496 కేసులు నమోదు కాగా, అందులో 398 కేసులను పరిష్కరించారు. 98 కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో గృహహింస కేసులు అధికంగా ఉండగా, అధికశాతం కేసుల్లో బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ కుదిర్చారు. ఈ కేంద్రం ద్వారా ఐదు రకాల సేవలను అందిస్తున్నారు.
అధికంగా గృహహింస కేసులు
ఉమ్మడి మెదక్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ముగ్గురు అభ్యర్థులు నిలిచారు. ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ వంటేరి యాదవరెడ్డి(గజ్వేల్), కాంగ్రెస్ పార్టీ నుంచి తూర్పు నిర్మల (సంగారెడ్డి), స్వతంత్ర అభ్యర్థి మట్ట మల్లారెడ్డి(దుబ్బాక) ఉన్నారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు శుక్రవారంతో ముగియగా.. వీరు బరిలో నిలిచారు. ఈ ఎన్నికకు డిసెంబర్ 10న పోలింగ్ జరుగనుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 1,027 మంది ఓటర్లు ఉండగా, 9 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనలతో బ్యాలెట్ విధానంలో ఈ ఎన్నిక జరుగనుంది.
మెదక్, నవంబర్ 26: మెదక్ జిల్లా కేంద్రంలో 2019 సెప్టెంబర్లో సఖీ సెంటర్ను అప్పటి జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి ప్రారంభించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సమన్వయంతో ఈ కేంద్రం నడుస్తోంది. గృహ హింస, పనిచేసేచోట లైంగిక వేధింపులు, వరకట్న వేధింపులకు గురవుతున్న వారికి సఖీ సెంటర్ నిర్వాహకులు అండగా ఉంటున్నారు. ప్రేమ పేరుతో, కుటుంబ కలహాలతో విడిపోయిన వారికి కౌన్సిలింగ్ ఇస్తూ వారిలో మార్పు తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు 170 అవగాహన సదస్సులు నిర్వహించి 31,820 మందికి సఖీ వివిధ రూపాల్లో సేవలు అందించింది. నిర్లక్ష్యానికి గురైన వయో వృద్ధులకు కూడా కావాల్సిన సహాయం చేస్తూ వారి సమస్యలను ప్రతినిధులు పరిష్కరిస్తున్నారు. సఖీ కేంద్రానికి వస్తున్న వాటిల్లో ఎక్కువగా గృహహింస కేసులు ఉంటున్నాయి. మెదక్ జిల్లాలో హింసకు గురై బాధపడుతున్న ఇతర రాష్ర్టాల మహిళలను కాపాడి వారిని వసతి గృహాలకు పంపిస్తున్నారు.
హెల్ప్లైన్ నంబర్ 181
సఖీ కేంద్రానికి బాధిత మహిళలు, బాలికలు హెల్ప్లైన్ నంబర్ 181 ద్వారా లేదా మెదక్ సఖీ కేంద్రం నంబర్ 08452-295181, 9346146580కు ఎలాంటి ఇబ్బంది ఉన్నా.. ఏ సమయంలోనైనా.. ఎక్కడి నుంచైనా 24/7 ఫోన్ చేసి సహాయాన్ని కోరవచ్చు. గృహహింస, వరకట్న వేధింపులు పనిచేసే చోట వేధింపులు, లైంగిక హింస, ఆడపిల్లల అమ్మకం, అక్రమ రవాణా నివారణ తదితర సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు. ఆడపిల్లలు పుడుతున్నారని భార్యలను ఇబ్బందులకు గురిచేసిన వారిపై గృహహింస చట్టం ద్వారా కేసు నమోదు చేస్తున్నారు. వివిధ కారణాలతో ఇప్పటి వరకు మెదక్ జిల్లాలో మొత్తం 496 కేసులు నమోదు కాగా, అందులో 398 కేసులను క్లోజ్ చేశారు. 98 కేసులు పెండింగ్లో ఉన్నాయి.
సమస్యలను పరిష్కరిస్తున్నాం..
సఖీ కేంద్రానికి వచ్చే వివిధ కేసులను రాజీ కుదిర్చేందుకు ప్రాధాన్యమిస్తున్నాం. భార్యాభర్తలకు వేర్వేరుగా కౌన్సెలింగ్ ఇస్తున్నాం. బాల్య వివాహాలు, ఇతర కేసుల్లో రెస్క్యూ చేసి తాత్కాలిక వసతి కల్పిస్తున్నాం. పోలీసుల ద్వారా వచ్చిన మిస్సింగ్ బాధితు లకు తాత్కాలిక వసతి కల్పించడం, కౌన్సెలింగ్ ఇస్తూ వారికి సరైన న్యాయం చేస్తున్నాం. వివిధ సమ స్యలతో బాధపడుతూ సఖీ కేంద్రా న్ని ఆశ్రయించిన మహిళలకు న్యాయ సలహాలు, సూచనలు
ఇస్తూ వారిలో మార్పు
తెచ్చేలా ప్రయత్నిస్తున్నాం.