శ్రీశైలం : మహిమాన్విత క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు సోమవారం ప్రత్యేక పూజలు జరిగాయి. మల్లన్నకు అత్యంత ప్రీతికరమైన సోమవారం ప్రదోషకాలంలో లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ దీపాలంకరణసేవ నిర్వహించినట్లు ఈఓ లవన్న తెలిపారు. ప్రధాన ఆలయ ప్రాకారంలో కుడివైపున ఉన్న పురాతన దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను ఊయలలో వేంచేపు చేసి వేదపండితులచే మహాసంకల్పాన్ని పఠించారు. వెయ్యి ఎనిమిది దీపాలను వెలిగించిన అర్చక వేదపండితులు దీపార్చన, పల్లకీ సేవను నిర్వహించారు.
ఆలయానికి తరలివస్తున్న భక్తులురాష్ట్రాల యాత్రికులే కాకుండా మహారాష్ట్ర కర్నాటక ప్రాంతాల నుంచి సైతం భక్తులు తరలివచ్చారు. సోమవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు సుమారు 20వేల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. క్యూలైన్ల వద్ద తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేసి, మాస్క్లు ధరించిన వారికి మాత్రమే ఆలయ ప్రవేశం కల్పిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు భక్తులు ఇబ్బందులకు గురయ్యారు.