కాజీపేట, నవంబర్ 28: హెల్మెట్ ధరించి బైక్ నడిపితే ప్రాణాలకు భద్రత ఉంటుందని సినీనటుడు సుమన్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని కాజీపేట లో ఆదివారం రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు హెల్మెట్లు ధరించి నిర్వహించిన బైక్ ర్యాలీని సుమన్ ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యే అరూరి రమేశ్, నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి పోలీసులు, జర్నలిస్టులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.