ముంబై: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)కు అయోధ్యం ఆహ్వానం అందింది. జనవరి 22వ తేదీన అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఆ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖుల్ని ఆహ్వానిస్తున్నారు. దీనిలో భాగంగా మాజీ క్రికెటర్ సచిన్కు కూడా ఆహ్వానం అందింది. ఇవాళ ఆయనకు ఆ ఆహ్వాన లేఖను అందజేశారు. శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర సుమారు 8000 వేల మందిని ఈ వేడుకకు ఆహ్వానించింది. ఆ జాబితాలో క్రికెటర్లు సచిన్, విరాట్ ఉన్నారు. బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, వ్యాపారవేత్తలు ముఖేశ్ అంబానీ, రతన్ టాటా ఉన్నట్లు తెలుస్తోంది.