న్యూఢిల్లీ: భారత్ 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఇవాళ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంగ్రాట్స్ తెలిపారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. భారత్, రష్యా మధ్య బంధం ప్రత్యేకమైందని, తమ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో భారత్ ఎంతో అభివృద్ధి సాధించిందని, ప్రపంచ స్థాయిలో భారత్ నిలిచిందని, అంతర్జాతీయ సమస్యలను పరిష్కరించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని పుతిన్ తెలిపారు.