సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 15: సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఈనెల 17న అల్ట్రారన్ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ఆవిష్కరించారు. గురువారం ఉదయం కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక గ్రామం నుంచి అల్ట్రారన్ మారథాన్ను లాంగ్ డిస్టెన్స్ రన్నర్ జగన్మోహన్రెడ్డి చేపడుతున్నారు. ఈ పరుగు ప్రారంభ కార్యక్రమంలో ఒలింపిక్ మాజీ అథ్లెట్ జేజే శోభ, కల్పనారెడ్డి, రామిరెడ్డి, మాజీ ఫుట్బాల్ ప్లేయర్ వెంకట్రెడ్డి, డీవైఎస్వో నాగేందర్ పాల్గొననున్నట్లు సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. వీరితో పాటు పలువురు అథ్లెట్లు రన్లో భాగమవుతారని పేర్కొన్నారు. చింతమడకలో ఉదయం నాలుగు గంటలకు మొదలయ్యే రన్..సిద్దిపేట నుంచి గజ్వేల్ స్పోర్ట్స్ విలేజ్ మైదానానికి చేరుకుంటుదని ఆయన మీడియాకు వివరించారు.