జబల్పుర్: మధ్యప్రదేశ్లోని జబల్పుర్ ఆర్టీవో అధికారి ఇంట్లో ఆర్థిక నేర విభాగానికి చెందిన అధికారులు సోదాలు నిర్వహించారు. ఆర్టీవో ఆఫీసర్తో పాటు ఆయన భార్యకు సంబంధించిన ప్రాపర్టీలను కూడా తనిఖీ చేశారు. అయితే అక్రమ రీతిలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు తమ ఆదాయానికి 650 రేట్లు ఎక్కువ ఆదాయం ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈ కేసులో 16 లక్షల నగదు, జ్వలరీని స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీవో ఆఫీసర్ సంతోష్ పౌల్తో పాటు భార్య లేఖా పౌల్పై ఆర్థికశాఖ తనిఖీలు నిర్వహించింది. ఆర్టీవో ఆఫీసులో లేఖ కూడా క్లర్క్గా పనిచేస్తోంది. అవినీతి జరిగినట్లు ఫిర్యాదు అందిన నేపథ్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు.