నిజామాబాద్ రూరల్, ఫిబ్రవరి 13 : టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమ్మక్క- సారక్క జాతరకు హాజరయ్యేందుకు ఆదివారం ఆర్టీసీ బస్సులో బయల్దేరారు. హైదరాబాద్ నుంచి కుటుంబ సభ్యులతో కలిసి జాతరకు వెళ్లారు.
ఈ సందర్భంగా తనతో పాటు కుటుంబ సభ్యులకు బస్సులో టికెట్ తీసుకున్నారు. ఆర్టీసీ చైర్మన్ వెంట సతీమణి వినోద, ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఐడీసీఎంఎస్ చైర్మన్ సంబారి మోహన్ ఉన్నారు.