బంజారాహిల్స్, నవంబర్ 30: వెంకటేశ్వరకాలనీలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి పనుల కోసం రూ.3కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారని మంగళవారం కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలో పెండింగ్ పనులకు అవసరమయ్యే నిధులు మంజూరు చేయడంతో పాటు కొత్తగా ప్రారంభించాల్సిన పనులకు నిధులు ఇవ్వాలని మంత్రిని కార్పొరేటర్ కోరారు. ఈ మేరకు ఆయా పనులకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేశారు. స్పందించిన మంత్రి కేటీఆర్ తక్షణమే నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు కార్పొరేటర్ తెలిపారు. సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ప్రేమ్, శౌరిరాజ్, భీమ్రాజ్, తదితరులు పాల్గొన్నారు.