15న చెకుల పంపిణీ: అల్లం నారాయణ
హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనాతో మరణించిన 63 మంది జర్నలిస్టుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్టు తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. ఈ నెల 15న రాష్ట్ర మీడియా అకాడమీ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఈ ఏడాది మార్చి నుంచి డిసెంబర్ 6 వరకు ఇతర కారణాలతో మరణించిన 34 మంది జర్నలిస్టుల కుటుంబాలకు కూడా అదే రోజు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్టు పేర్కొన్నారు. కరోనాతో మరణించిన ముగ్గురు జర్నలిస్టుల కుటుంబాలకు ఈ ఏడాది మార్చిలో ఓసారి ఆర్థిక సహాయం అందించామని, ఈ కుటుంబాలకు ఇప్పుడు అదనంగా మరో రూ.లక్ష చొప్పున.. అనారో గ్యం బారిన పడి పనిచేయలేని స్థితిలో ఉన్న న లుగురు జర్నలిస్టులకు రూ.50 వేల చొప్పున చెకులను అందిస్తామని వివరించారు. ఈ విధంగా మొత్తం 101 మంది జర్నలిస్టుల కు టుంబాలకు రూ.1.62 కోట్లు పంపిణీ చేయడంతోపాటు ఆయా కుటుంబాలకు ప్రతి నెలా రూ.3 వేల చొప్పున ఐదేండ్లపాటు పెన్షన్ కూ డా అందిస్తామని చెప్పారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులను ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర మీడియా అకాడమీ ఆదుకొన్నదని అల్లం నారాయణ తెలిపారు. ఇప్పటివరకు కరోనా బారినపడిన 6,178 మందికి రెండు విడతల్లో ఆర్థిక సహాయం అందించామని వివరించారు.