‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్తో కలిసి హైదరాబాద్ గచ్చిబౌలిలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ..‘సినిమా మాధ్యమం చాలా శక్తివంతమైనది. హీరోలతో పాటు 24 విభాగాల వారు సమాజానికి చక్కటి హరిత సందేశాన్ని ఇచ్చి స్ఫూర్తి కలిగించవచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం సినిమా విడుదల పనుల్లో తీరిక లేకుండా ఉన్నా, ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’లో పాల్గొనడం ఆనందంగా ఉంది. వారికి నా ధన్యవాదాలు’ అన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులను గమనించి ప్రకృతి రక్షణ కోసం కృషి చేయాలి. భూమిపై మనమంతా అతిథులమే అని గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో పిల్లల్ని చూసుకున్నంత జాగ్రత్తగా మొక్కలను నాటి, సంరక్షించాలి’ అని ఎన్టీఆర్ చెప్పారు. రామ్ చరణ్ మాట్లాడుతూ..‘గతంలో కూడా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ కార్యక్రమంలో పాల్గొన్నాను. మొక్కలు నాటిన ప్రతిసారీ మనసంతా ఉత్సాహంతో నిండిపోతుంది. దేశవ్యాప్తంగా హరితస్ఫూర్తిని నింపుతున్న ఎంపీ సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు’ అన్నారు. రాష్ట్రం, దేశం ప్రకృతితో పచ్చగా ఉండాలనే సంతోష్ గారి సంకల్పం గొప్పదని, ఈ కార్యక్రమం మరింత విజయవంతం కావాలని కోరారు దర్శకుడు రాజమౌళి. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్లు కరుణాకర్ రెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
గౌరవంగా గ్రీన్ ఇండియా లో తమను చేసిన ఎంపీ సంతోష్ కుమార్కు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞ తలు తెలిపారు ఎన్టీఆర్, చరణ్. ఇది తమకొక గౌరవం వారు పేర్కొన్నారు.