లండన్: టీమిండియా టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త రికార్డు క్రియేట్ చేశాడు. భారత జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఇప్పటి వరకు అతని నేతృత్వంలోని జట్టు టీ20ల్లో ఓడలేదు. గురువారం ఇంగ్లండ్తో జరిగిన టీ20 మ్యాచ్లో ఇండియా 50 రన్స్ తేడాతో ఈజీ విక్టరీ కొట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో రోహిత్ శర్మ కొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. కెప్టెన్గా వరుసగా 13 టీ20 మ్యాచుల్లో గెలిచిన ఘనతను సొంతం చేసుకున్నాడు. గతంలో ఏ జట్టు కెప్టెన్గా కూడా ఇన్ని మ్యాచుల్లో విజయాలు సాధించలేదు. విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ టీ20 సారథ్య బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఇటీవల న్యూజిలాండ్, విండీస్, శ్రీలంక, ఇంగ్లండ్ సిరీస్ల్లో రోహిత్ టీమ్ అద్భుత ప్రదర్శన కనబరిచింది.
🚨 Milestone Alert 🚨
First captain to win 1⃣3⃣ successive T20Is – Congratulations, @ImRo45. 👏 👏#TeamIndia | #ENGvIND pic.twitter.com/izEGfIfFTn
— BCCI (@BCCI) July 7, 2022