టీమిండియా టెస్టు కెప్టెన్సీకి కోహ్లీ వీడ్కోలు పలికిన తర్వాత.. నెక్స్ట్ భారత టెస్టు కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్న క్రీడాలోకాన్ని కలవరపరుస్తోంది. టెస్టు క్రికెట్లో కోహ్లీ అత్యుత్తమ ప్రమాణాలు కనబరచడమే అందుకు కారణం.
ఈ క్రమంలోనే పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ పేరు కూడా తెరమీదకు వచ్చింది. ఈ క్రమంలో భారత క్రికెట్లోని ఈ సమస్యపై ఆసీస్ దిగ్గజ కెప్టెన్, మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ స్పందించాడు. రోహిత్ శర్మను తర్వాతి టెస్టు కెప్టెన్ చేయడం సమంజసమని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.
దానికి కావలసిన ఆధారాలన్నీ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ సారధిగా రోహిత్ సాధించిన విజయాల్లో ఉన్నాయన్నాడు. అలాగే గడిచిన రెండు, మూడేళ్లలో తన టెస్టు క్రికెట్ను రోహిత్ మలుచుకున్న తీరును కూడా ప్రస్తావించాడు. అందుకే తర్వాతి టెస్టు కెప్టెన్గా రోహిత్ ఉంటేనే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.