టీ20 ప్రపంచకప్లో భాగంగా సూపర్ 12లో జరుగుతున్న చివరి మ్యాచ్ ఇది. ఇండియా, నమీబియా మధ్య జరుగుతున్న ఈ పోరులో నమీబియా ఇన్నింగ్స్ తర్వాత బ్యాటింగ్ బరిలోకి దిగిన భారత్.. చెలరేగి ఆడుతోంది. టీమిండియా ఓపెనర్లు కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ.. పరుగుల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మరోవైపు టీ20 ఇంటర్నేషనల్ చరిత్రలో 3000 పరుగుల మైలురాయిని క్రాస్ చేశాడు. కేఎల్ రాహుల్ కూడా రాణిస్తున్నాడు. మొత్తం మీద ఓపెనర్లే మ్యాచ్ను ముందుకు తీసుకెళ్తున్నారు. మరో ఐదారు ఓవర్లలోనే ఓపెనర్లే మ్యాచ్ను ముగించేటట్టుగా కనిపిస్తోంది.