దుబాయ్: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక ర్యాంకు చొప్పున పడిపోయారు. బ్యాటింగ్ జాబితాలో హిట్మ్యాన్ రోహిత్ (754), మాజీ కెప్టెన్ కోహ్లీ (742) ఎనిమిది, పదో ర్యాంక్కు చేరుకున్నారు. ఆల్రౌండర్ విభాగంలో రవీంద్ర జడేజా అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా.. రవిచంద్రన్ అశ్విన్ ఒక ర్యాంకు మెరుగై రెండో స్థానానికి చేరుకున్నాడు. బౌలింగ్లో అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా 2, 4 ర్యాంక్ల్లో ఉన్నారు. వన్డేల్లో కోహ్లీ, రోహిత్ నాలుగో స్థానాల్లో కొనసాగుతుండగా.. బౌలింగ్లో బుమ్రా ఆరో ర్యాంకులో ఉన్నాడు.