అమరావతి : ఏపీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ (MLC) కి తీవ్రగాయాలు కాగా అతడి పీఏ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి నెల్లూరు(Nellore) జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలక వద్ద ఎమ్మెల్సీ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొంది. దీంతో కారులో ఉన్న టీచర్స్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి(Chandra Shekar Reddy) కి తీవ్రగాయాలయ్యాయి. పీఏ వేంకటేశ్వర్లు అక్కడికక్కడే మరణించారు.
ఘటన జరిగిన సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Choreographer Johnny Master) గమనించి తీవ్రగాయాలతో ఉన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్రెడ్డి ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.