హైదరాబాద్: ఒక జాతీయ పార్టీగా బీహార్లోనేగాక బీహార్ వెలుపల కూడా సత్తా చాటాలని భావిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) ఇప్పుడు పశ్చిమ బెంగాల్, అసోం ఎన్నికలపై దృష్టి సారించింది. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి అసోం ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇదివరకే ప్రకటించిన ఆ పార్టీ అగ్రనేత తేజస్వీయాదవ్.. పశ్చిమబెంగాల్లోనూ అధికార టీఎంసీతో కలిసి పోటీచేసే యోచనలో ఉన్నారు. అందులోభాగంగా ఇవాళ మమతాబెనర్జితో తేజస్వి భేటీ కానున్నారు. ఆదివారం కోల్కతాకు చేరుకున్న తేజస్వియాదవ్ పార్టీ కార్యకర్తలను కలిసి ఎన్నికల్లో అనుసరించాల్సిన విధివిధాలనాలపై చర్చించారు. ఇవాళ ఆయన మమతాబెనర్జిని కలిసి పొత్తులపై మాట్లాడనున్నట్టు సమాచారం. కాగా, అసోంలో కాంగ్రెస్, ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్తో కలిసి ఆర్జేడీ బరిలోకి దిగనుంది.