రాంచీ, ఫిబ్రవరి 21: దాణా కుంభకోణం ఐదో కేసులో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్కు సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేసింది. ఐదేండ్ల జైలు, రూ.60 లక్షల జరిమానా విధించింది. రూ.950 కోట్ల దాణా కుంభకోణానికి సంబంధించిన నాలుగు కేసుల్లో ఇప్పటికే తీర్పునిచ్చిన సీబీఐ ప్రత్యేక కోర్టు అన్ని కేసుల్లోనూ లాలూను దోషిగా తేల్చింది. డోరండా ఖజానా నుంచి రూ.139 కోట్లు అక్రమంగా విత్డ్రా చేశారన్న ఐదో కేసులో కూడా దోషిగా తేలుస్తూ ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. కాగా, అనారోగ్యంతో రాంచీలోని రిమ్స్లో చికిత్స పొందుతున్న లాలూ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు చెప్పారు.