గద్వాల, డిసెంబర్ 8 : జోగుళాంబ గద్వాల జిల్లాలో వరి కోతలు జోరందుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మిషన్లతో.. మరికొన్ని చోట్ల కూలీలతో కోతలు కోయిస్తున్నారు. దీంతో కూలీలకు ఉపాధి దొరకడంతోపాటు యంత్రాలకూ పని లభిస్తున్నది. ఈ వానకాలం సీజన్లో కాలువలు, రిజర్వాయర్లు, బోరు బావుల కింద 95,571 ఎకరాల్లో వరి సాగు చేశారు. ప్రస్తుతం పంట చేతికి రావడంతో రైతులు పంటలు కోయిస్తున్నారు. జిల్లాలో 74 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా.. అధికారులు ఇప్పటికే 66 కేంద్రాలు ప్రారంభించారు. అందులో 17 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయి. దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తున్నది. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద హోరందుకున్నది. 1.90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని జిల్లా అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏ గ్రేడ్ ధాన్యం రకానికి రూ.1,960, సాధారణ రకానికి రూ.1,940 మద్దతు ధర అందిస్తున్నారు. కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొచ్చే సమయంలో తేమ 14 నుంచి 17 శాతం కంటే ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్బుక్కు, బ్యాంక్ పాస్ పుస్తకం జీరాక్స్ కాపీలను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.
వేగంగా ధాన్యం కొనుగోళ్లు..
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరుగుతున్నాయి. వారం రోజుల్లోనే 17 కొనుగోలు కేంద్రాల ద్వారా 130 మంది రై తుల నుంచి 842.600 మెట్రిక్ ట న్నుల ధాన్యం సేకరించారు. రైతు లు కొనుగోలు కేంద్రాలకు ధా న్యం తీసుకొచ్చి ఆరబెట్టుకుంటున్నారు. దీంతో ఎ టువంటి ఇబ్బందుల్లేకుండా రైతులు ధా న్యాన్ని అమ్ముకుంటున్నారు.