సిటీబ్యూరో, నవంబర్ 11(నమస్తే తెలంగాణ): కాటేదాన్లో ఇటీవల ఓ బ్యాటరీ పరిశ్రమలో జరిగిన దొంగతనం కేసును ఛేదించిన మైలార్దేవ్పల్లి పోలీసులు, శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర అభినందిస్తూ రివార్డులు అందజేశారు. బీహార్కు చెందిన మహ్మద్ మసూద్ వ్యాపారి వద్ద నమ్మకంగా పనిచేశాడు. అదను చూసి పరిశ్రమలో దాచిపెట్టిన రూ. 50.30 లక్షలు తన స్నేహితులతో కలిసి దొంగిలించాడు. ఈ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 11.15 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు చేసిన సిబ్బందికి సీపీ రివార్డులు అందజేశారు.