న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఇటీవలకాలంలో ఇన్వెస్టర నుంచి నిధులు సేకరించడమే ధ్యేయంగా కుప్పతెప్పలుగా వస్తున్న ఐపీవోలకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్లు) చెక్పెడుతూ నిబంధనల్ని సెబీ కఠినతరం చేసింది. నిధుల వినియోగం, ప్రస్తుత షేర్హోల్డర్ల వాటా విక్రయాలపై ఆంక్షలు విధించింది. సోమవారం సెబీ బోర్డు సమావేశం అనంతరం సంస్థ చైర్మన్ అజయ్ త్యాగి ఇందుకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ఐపీవోల జారీ ధరలను మాత్రం నియంత్రించబోమని, వాటి ధర మార్కెట్ ఆధారితమేనని, అంతర్జాతీయంగా కూడా ఇదే ప్రక్రియను అవలంభిస్తున్నారన్నారు.
ఎంఎఫ్ స్కీమ్లకు యూనిట్హోల్డర్ల అనుమతి
సెబీ బోర్డు నిర్ణయాలు..