న్యూఢిల్లీ: పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల అంశంపై తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం రిజర్వు చేసింది. జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని బెంచ్ ముందు అటార్నీ జనరల్ (ఏజీ) కేకే వేణుగోపాల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ బల్బీర్ సింగ్, వివిధ రాష్ర్టాల తరఫున హాజరైన న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. 75 ఏండ్ల తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీలను ఉన్నత కులాలతో సమాన స్థాయికి తీసుకురాలేకపోవడం వాస్తవమని గత విచారణ సందర్భంగా ఏజీ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు గ్రూప్ ఏ క్యాటగిరీలో ఉన్నత పోస్టు సాధించడం కష్టంగానే ఉన్నదని, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ పదోన్నతులకు సుప్రీంకోర్టు బలమైన ప్రాతిపదిక ఇవ్వాలని కోరారు.