హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): నిబంధనలు ఉల్లంఘించి ప్రకటనలు ఇస్తూ, మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏజీఎస్ సంస్థకు రియల్ ఎస్టే ట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) రూ.50 లక్ష ల ఆపరాధ రుసుంను విధించింది.
జయత్రి (జయ గ్రూపు) ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎజీఎస్ శ్రీనివాస్ ప్రాపర్టీస్ ప్రైవేటు లిమిటెడ్ (ఎజీఎస్ గ్రూపు), ఈఏపీఎల్ సంయుక్తంగా ఏజీఎస్ పేరుతో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోకుం డా మార్కెటింగ్ నిర్వహిస్తున్నాయని, అమ్మకాలకు ప్రకటనలు విడుదల చేస్తున్నాయని గుర్తించిన రెరా నోటీసులు జారీ చేసింది.