మైలార్దేవ్పల్లి :మధుబన్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాలనీ వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి ప్రకాష్గౌడ్కు వినతిపత్రం అందజేశారు. మంగళవారం అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.మధుబన్ కాలనీ ఏర్పడి 37 సంవత్సరాలు కావస్తున్నదని, అయినా ఇప్పటిఈక కాలనీలో పలు సమస్యలు ఉన్నాయని తెలిపారు.
5 పార్కు స్థలాలు ఉన్న ఒక్క పార్కు అభివృద్ధికి నోచుకోవడంలేదని ఎమ్మెల్యేకు వివరించారు.బస్తీ దవాఖాన లేక పేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అలాగే మధుబన్ ప్రధాన రహదారిపై నిత్యం డ్రైనేజీ నీరు పొంగి పొర్లుతుందని అన్నారు.కాలనీలో పందుల బెడద కూడా తీవ్రంగా ఉందని, వాటిని కాలనీలో నుంచి తరలించేలా చూడాలని కోరారు.
కాలనీలో పర్యటించి సమస్యలు పరిష్కరించాలని కాలనీ అధ్యక్ష కార్యధర్శిలు కోరారు. సమస్యలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని అధ్యక్షుడు సామల సతీష్ అన్నారు.ఎమ్మెల్యేను కలిసిన వారిలో కావలి వెంకటేష్,గోవింద్రాజ్ ,డీవి కుమార్ ,ఆర్ ప్రశాంత్గౌడ్ ,నాని,విజయ్కుమార్ తదితరులు ఉన్నారు.