హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న టీఎస్ ఐపాస్లో రిజిస్ట్రేషన్కు విధించిన రూ. 5000 ఫీజును తగ్గించాలని టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. మంగళవారం హైదరాబాద్లో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ను కలిసి రిజిస్ట్రేషన్ రుసుమును రూ.500లకు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారి కారణంగా టూర్స్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ ఎంతో నష్టపోయారని మంత్రికి వివరించారు. టూరిజం ఏజెంట్ల సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్రావు, జాయింట్ సెక్రటరీ రమణకుమార్ మంత్రిని కలిసినవారిలో ఉన్నారు.