కేపీహెచ్బీ కాలనీ, జనవరి 26 : కూకట్పల్లిలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, పరిశ్రమలు, ప్రధాన కూడళ్లు , కాలనీలు, సంక్షేమ సంఘాల ప్రజలు మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించి జెండావందనం చేశారు. కేపీహెచ్బీ కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పగుడాల బాబురావు, వార్డు కమిటీ సభ్యులు పవన్కుమార్, పాతూరి గోపి, దత్తు, నేతలు పాల్గొన్నారు.