విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (Vizag Steel Plant)లో సోమవారం జరిగిన ఘోర ప్రమాదం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా వైజాగ్ చేరుకుని బాధితులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్లాంట్ లోపల పరిస్థితిని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయనకు ఒక కీలకమైన ప్రశ్న ఎదురైంది. స్టీల్ ప్లాంట్ లోపల భద్రతా ప్రమాణాలు సరిగా లేవని, ముఖ్యంగా యాజమాన్యం పర్యవేక్షణ మరియు నిర్వహణ లోపం చాలా ఎక్కువగా ఉందనే ఆరోపణలు వస్తున్నాయని ఒక లేడి రిపోర్టర్ పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనికి ఉపముఖ్యమంత్రి స్పందిస్తూ… ప్లాంట్ సాంకేతిక నిర్వహణకు సంబంధించిన విషయాలపై నాకు అనుభవం లేదంటూ బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చారు.
దీంతో పవన్ స్పందించిన తీరుపై ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఒక రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా ఉంటూ, ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు “నాకు అనుభవం లేదు” అని చేతులు దూళిపేసుకోవడం బాధ్యతారాహిత్యమేనని వారు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
రిపోర్టర్ : స్టీల్ ప్లాంట్లో నిర్వహణ లోపం ఎక్కువగా ఉందంటున్నారు..?
పవన్ కల్యాణ్ : దీనికి సంబంధించి నాకు అనుభవం లేదు, వాళ్లు అంటున్నారు, కమిటీకి చెప్పగలను. pic.twitter.com/XzzBo0rZjO
— Telugu Feed (@Telugufeedsite) June 9, 2026