రెమ్డెసివిర్ ఇంజక్షన్ను బ్లాక్లో విక్రయిస్తున్న ముగ్గురు యువకులను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధకిషన్రావు కథనం ప్రకారం.. ప్రైవేట్ ఉద్యోగులైన రాంనగర్కు చెందిన ప్రవీణ్కుమార్, సికింద్రాబాద్కు చెందిన రాజేందర్ స్నేహితులు. గత ఏడాది లాక్డౌన్ కారణంగా ఇద్దరి ఉద్యోగాలు పోయాయి. గత ఏడాది నుంచి ఖాళీగా ఉంటున్నారు. తాజాగా రెమ్డెసివిర్ ఇంజక్షన్కు మార్కెట్లో డిమాండ్ ఉండటంతో ఉప్పల్లోని ఒక మెడికల్ దుకాణంలో పనిచేసే తమ స్నేహితుడైన రాజుతో ఇంజక్షన్ గురించి వాకబు చేశారు. రాజు ఇంజక్షన్లు తెచ్చిస్తే బ్లాక్మార్కెట్లో ఒక్కోదానికి రూ.35 వేల చొప్పున విక్రయించేందుకు ప్రణాళిక రచించాడు. ఇందులో భాగంగా రాజు రెండు ఇంజక్షన్లను తెచ్చి ప్రవీణ్, రాజేందర్కు అప్పగించాడు. దీంతో ఆదివారం రెండు ఇంజక్షన్లను ఒక్కోదాన్ని నల్లకుంట ప్రాంతంలో రూ.30 వేలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ జావెద్ బృందం ఆ ముగ్గురిని అరెస్ట్ చేసింది. వాళ్ల వద్ద నుంచి రెండు ఇంజక్షన్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు తదుపరి విచారణను నల్లకుంట పోలీసులకు అప్పగించారు.