Supreme Court | ఒరేవా గ్రూప్ ఎండీ జైసుఖ్ పటేల్కు సుప్రీంకోర్టులో ఊరట కలిగింది. మోర్బీ వంతెన కూలిన ఘటనలో ఆయన కఠిన షరతులతో విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2022 అక్టోబర్ నాటి వంతెన కూలిన ఘటనలో 135 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఒరేవా గ్రూప్ సంస్థ 2008 నుంచి వంతెన నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్నది. వంతెన పునరుద్ధరణ పనుల తర్వాత 2022లో దీపావళి పండుగ నేపథ్యంలో పౌరులను వంతెనపైకి అనుమతించింది. వంతెన పునః ప్రారంభానికి ముందు జైసుఖే పటేల్ మీడియా సమావేశం నిర్వహించారు.
వంతెన ప్రారంభానికి ముందు వంతెన మరమ్మతు పనులు సక్రమంగా జరిగాయా? లేదా? తేల్చేందుకు సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉన్నా.. ఆయన తీసుకోలేదు. ఘటన అనంతరం ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. పటేల్ 14 నెలలుగా జైలులో ఉన్నారు. కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. జస్టిస్ అభయ్ ఓకా, ఉజ్జల్ భుయూన్ ధర్మాసనం బాధితుడి తరఫున వాదనలు పరిగణలోకి తీసుకున్నది. వారం రోజుల్లోగా పటేల్ను మోర్బి కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించిన సుప్రీంకోర్టు, విచారణ పెండింగ్లో ఈ అంశంపై ప్రభుత్వ న్యాయవాది వాదనలు విన్న తర్వాత ‘కఠినమైన షరతులతో’ ఆయనను బెయిల్ పై విడుదల చేయడానికి ట్రయల్ కోర్టుకు అనుమతించింది.