తిరుమల : తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేంకటేశ్వరస్వామి భక్తులు దర్శనానికి 15 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం (Sarvadarshanam) అవుతుందని ఆలయ అధికారులు వివరించారు.
నిన్న స్వామివారిని 71,142 మంది భక్తులు దర్శించుకోగా 26,619 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల రూపేణా స్వామివారికి రూ. 4.13 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడించారు.