న్యూఢిల్లీ : షియోమి సబ్ బ్రాండ్ రెడ్మి త్వరలో భారత్లో రెడ్మి న్యూ నోట్ 12 సిరీస్ను లాంఛ్ చేస్తోంది. పలు రూమర్ల అనంతరం రెడ్మి న్యూ నోట్ 12 సిరీస్ను భారత్లో లాంఛ్ చేయనున్నట్టు కంపెనీ వెల్లడించింది. అయితే భారత్లో లేటెస్ట్ స్మార్ట్ఫోన్ ఎప్పుడు లాంఛ్ అవుతుందనే తేదీ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.
ఐఫోన్ 13 ప్రొ మోడల్స్ నుంచి ఇన్స్పిరేషన్ పొందిన తరహాలో రెడ్మి రివీల్ చేసిన కెమెరా మాడ్యూల్ గ్లింప్స్ కనిపించింది. న్యూ నోట్ 12 సిరీస్ ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉంది. రెడ్మి నోట్ 12, రెడ్మి నోట్ 12 ప్రొ, నోట్ 12 ప్రొ+ వంటి మూడు మోడల్స్తో రెడ్మి నోట్ 12 సిరీస్ కస్టమర్ల ముందుకొచ్చింది. రెడ్మి నోట్ 12 5జీ కేవలం నోట్ కాదు..అది సూపర్నోట్ అంటూ రెడ్మి ట్విట్టర్ పోస్ట్లో పేర్కొంది.
భారత్లో న్యూ నోట్ 12ను వచ్చే ఏడాది రెడ్మి లాంఛ్ చేయనుందని అంచనా వేస్తున్నారు. రెడ్మి గతంలో తన నోట్ ఫోన్లను జనవరిలో ప్రవేశపెట్టడంతో రెడ్మి న్యూ నోట్ 12 5జీ కూడా వచ్చే ఏడాది జనవరిలో కస్టమర్ల ముందుకు రానుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెడ్మి నోట్ 12 5జీ భారత్లో ఎంత ధర పలుకుతుందనేది కంపెనీ ఇంకా వెల్లడించలేదు.