అహ్మదాబాద్: వెస్టిండీస్ సిరీస్ ప్రారంభానికి ముందు కరోనా వైరస్ బారినపడిన భారత బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ కోలుకున్నాడు. జట్టులో మార్పులు చేర్పులు జరిగితే శుక్రవారం జరుగనున్న మూడో వన్డేకు గైక్వాడ్ అందుబాటులో ఉండే అవకాశం ఉంది. మహమ్మారి నుంచి కోలుకున్న గైక్వాడ్ ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చాడు. టీ20 సిరీస్కు ఎంపిక కాని ఈ యువ క్రికెటర్ను ఆఖరి వన్డేలోనైనా ఆడిస్తారో లేదో వేచి చూడాలి. ఈ సిరీస్ అనంతరం దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో బరిలోకి దిగనున్నాడు. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సిరీస్కు దూరమైన గైక్వాడ్కు వెస్టిండీస్ వన్డే సిరీస్లో అవకాశం లభించగా కరోనా రూపంలో దురదృష్టం వెంటాడింది. పాజిటివ్ అని తేలడంతో రెండు వన్డేలకు దూరమయ్యాడు.