గజ్వేల్ మార్కెట్లో రికార్డు ధర
గజ్వేల్/ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 1: ఈ సీజన్లో తెల్లబంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. రికార్డు స్థాయిలో పెరుగుతూ రైతులకు సిరులు కురిపిస్తున్నాయి. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్లో క్వింటాల్ పత్తికి గరిష్ఠంగా రూ.8,696 పలికింది. అటు ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర జోరు కొనసాగుతున్నది. సోమవారం గరిష్ఠ ధర క్వింటాల్కు రూ.8,400 పలికింది. సీసీఐ మద్దతు ధర కంటే రూ.2,400 అదనంగా దక్కింది. నెల రోజుల వ్యవధిలోనే క్వింటాల్ ధర రూ.2 వేలు పెరిగింది. అత్యధిక ధరలు వస్తుండటంతో పత్తి రైతులు సంబురపడుతున్నారు.