న్యూఢిల్లీ, జూన్ 9: ఇంటా బయట దేశ ఆర్థిక వ్యవస్థకు ఎదురీత తప్పేటట్టు లేదన్న విషయం అర్థమైపోవడంతో మోదీ సర్కార్.. భారీ నిధుల సమీకరణ దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగానే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ), పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ వేగవంతం, ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ కోసం సంస్కరణల బాట పట్టనున్నట్టు తెలుస్తున్నది.
ప్రధానంగా పశ్చిమాసియా సంక్షోభం దెబ్బకు ఇంధనం, ఎరువుల దిగుమతులు తడిసిమోపెడవుతున్నాయి. ఇవి దేశ జీడీపీ ప్రగతికి ప్రతిబంధకాలుగా మారుతుండటంతోనే కేంద్ర ప్రభుత్వం బడా ప్లాన్కు రూపకల్పన చేస్తున్నదని చెప్తున్నారు. దేశంలోని ఫారెక్స్ రిజర్వులు నానాటికీ కరిగిపోతుండటంతో దీర్ఘకాల విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు పాలసీల్లో మార్పులు జరుగవచ్చన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.