రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. విరాట్ కోహ్లీ (9) అవుటైన తర్వాత మరో వికెట్ పడకుండా కెప్టెన్ డుప్లెసిస్ (23) జాగ్రత్తగా జట్టును నడిపించాడు. కోహ్లీ అవుటైన తర్వాత వచ్చిన యువ ఆటగాడు పటీదార్ నిదానంగా ఆడుతున్నా కూడా.. డుప్లెసిస్ నిలకడగా రాణిస్తూ స్కోరును ముందుకు నడిపించాడు.
అయితే తర్వాతి ఓవర్లోనే డుప్లెసిస్ (23)ని యువ బౌలర్ కుల్దీప్ సేన్ అవుట్ చేశాడు. కుల్దీప్ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన డుప్లెసిస్.. బట్లర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి బంతికే స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్వెల్ (0) గోల్డెన్ డక్గా వెనుతిరిగాడు. కుల్దీప్ వేసిన బంతిని ఆఫ్సైడ్ ఆడేందుకు ప్రయత్నించడంతో.. ఎడ్జ్ తీసుకున్న బంతిని స్లిప్స్లో ఫీల్డింగ్ చేస్తున్న పడిక్కల్ అందుకున్నాడు. దీంతో మ్యాక్స్వెల్ కూడా పెవిలియన్ చేరాడు.