ముంబై: ఐపీఎల్కు రిటైర్మెంట్ పలుకుతున్నట్లు చెన్నై స్టార్ బ్యాటర్ రాయుడు ట్వీట్ చేయడం ఒకింత అలజడి రేపింది. గత సీజన్లకు భిన్నంగా ఈసారి రాయుడు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమవుతు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్కు వీడ్కోలు అంటూ రాయుడు ట్వీట్ చేశాడు. ‘ఐపీఎల్లో ఇదే నా చివరి సీజన్ అని చెప్పేందుకు సంతోషిస్తున్నా. గత 13 ఏండ్లుగా ఐపీఎల్తో అనుబంధం ఉంది. రెండు అత్యుత్తమ జట్ల తరఫున ఆడడం అద్భుతమైన అనుభూతి ఇచ్చింది. ఈ అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్కింగ్స్కు కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే తొలిగించాడు. అప్పటికే ఆ ట్వీట్ వైరలవడంతో చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథ్ వివరణ ఇచ్చాడు. ‘నేను రాయుడుతో మాట్లాడాను. అతడు రిటైర్ కావడంలేదు. ఈ సీజన్లో అతడు తన ఆటతీరుతో అసంతృప్తితో ఉన్నాడు. దీంతోనే పొరపాటున ఆ ట్వీట్ చేసి ఉంటాడు. కానీ ఆ తర్వాత దాన్ని తొలగించాడు. రాయుడు రిటైర్ కావడం లేదు’ అని స్పష్టం చేశాడు. 36 ఏండ్ల రాయుడు ఇలా యూటర్న్ తీసుకోవడం ఇది కొత్తేమీ కాదు. గతంలోనూ ఇలా యూటర్న్ తీసుకున్నాడు.